News March 10, 2025
వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.
Similar News
News December 29, 2025
అంతర్వేది వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి: కలెక్టర్

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ ఏర్పాట్లపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జనవరిలో జరిగే ఈ వేడుకలకు భక్తులు భారీగా వస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, క్యూలైన్ల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదని, భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 29, 2025
శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి.. ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబయ్యాయి. అరసవిల్లి, శ్రీకూర్మం, నారాయణ తిరుమల ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.
News December 29, 2025
మెదక్ జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..!

మెదక్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ యేడు రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. మెదక్లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది 636 ప్రమాదాలు జరిగి 350 మంది మృతిచెందగా, 625 మంది గాయపడినట్లు వివరించారు. 2025లో 6 శాతం తక్కువగా 598 ప్రమాదాలు, 29 శాతం తక్కువగా 247 ప్రమాదాలు, 598 మంది క్షతగాత్రులైనట్లు వివరించారు.


