News March 10, 2025

వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

image

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.

Similar News

News February 24, 2026

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

image

గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారీ తనిఖీల్లో భాగంగా గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన తాళాల సీల్, సీసీ కెమెరాల డిస్‌ప్లే, ప్రాంగణాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News February 24, 2026

భూ సమస్యలకు చెక్.. ‘రెవెన్యూ క్లినిక్’తో పరిష్కారం

image

రెవెన్యూ క్లినిక్ ల ద్వారా భూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే, కుల విచారణ, డిజిటల్ రికార్డుల రూపకల్పనపై సమీక్షించారు. రికార్డుల ప్రక్షాళనను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్లకు సూచించారు.

News February 24, 2026

యువత రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్

image

ఏపీ శాసనసభను మంగళవారం 510 మంది విద్యార్థులు సందర్శించారు. పది రోజుల విజ్ఞాన యాత్రలో భాగంగా 93 పాఠశాలల నుంచి 3,311 మంది అసెంబ్లీని వీక్షించారు. సభా విరామంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విద్యార్థులతో ముచ్చటించి సందేహాలను నివృత్తి చేశారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. యువత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.