News February 4, 2025
వర్గల్: 50 వేలకు పైగా దర్శించుకున్న భక్తులు

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: 2018 నుంచి BRS VS కాంగ్రెస్

జూబ్లీహిల్స్లో ఎన్నికలను పరిశీలిస్తే 2018 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, BRS మధ్యే పోటీ నడుస్తోంది. 2018లో TRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలవగా INC అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2023లో BRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మళ్లీ గెలవగా INC అభ్యర్థి అజహరుద్దీన్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఉపఎన్నికలో INC అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవగా BRS అభ్యర్థి మాగంటి సునీత సెకండ్ ప్లేస్లో నిలిచారు.
News November 14, 2025
అమృతం యాప్ పనితీరుపై అధికారులకు శిక్షణ

RGM మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులకు ట్యాబ్లు అందజేశారు. సాంకేతిక సహకారంతో JIO ట్యాగింగ్, సర్వేల నమోదు, సమస్యల పరిశీలన వంటి పనులు వేగవంతమవుతాయని కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ప్రజలు తమ సమస్యలు ప్రత్యక్షంగా లేదా ఫోన్ ద్వారా వార్డు అధికారులకు తెలియజేయాలని సూచించారు. నల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్లో నమోదు చేసే విధానంపై అధికారులు శిక్షణ పొందారు. సమావేశంలో గురువీర, రామన్ తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
బాలల దినోత్సవం.. వరంగల్ పోలీసుల సందేశం

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీసులు పిల్లల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. సైబర్ ముప్పులు, వేధింపుల నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతి పౌరుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు రక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు.


