News February 4, 2025
వర్గల్: 50 వేలకు పైగా దర్శించుకున్న భక్తులు

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 17, 2026
20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్ను రెండు దశల్లో నిర్వహిస్తారు.
News April 17, 2026
కామారెడ్డి: ఈ నెల 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షను ఈ నెల 19 (ఆదివారం) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 7వ నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. www.tgms.telangana.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
News April 17, 2026
ఉమ్మడి జిల్లా జెడ్పీ సీఈవోగా విజయలక్ష్మి

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈవోగా విజయలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం గుంతకల్లు డీడీవోగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఆమె నియామకంపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. శుక్రవారం విడుదలైన ఆదేశాల మేరకు ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.


