News February 1, 2025
వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News October 16, 2025
ఫెడరల్ బ్యాంక్లో ఉద్యోగాలు

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్సైట్:https://www.federalbank.co.in/
News October 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 37

1. నీళ్లు తాగుతున్న శబ్దం విని, జింక అనుకొని దశరథుడు ఎవర్ని సంహరించాడు?
2. అభిమన్యుడు, ఉత్తరల పుత్రుడు ఎవరు?
3. వాయుదేవుడి వాహనం ఏది?
4. విష్ణువు ఏ అవతారంలో జలరాక్షసుడైన శంఖాసురుడిని సంహరించాడు?
5. నవతి అంటే ఎంత?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>
News October 16, 2025
పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

పాడి పశువులను రోజంతా కట్టేసి ఉంచడం ఏమాత్రం మంచిది కాదని కడపకు చెందిన వెటర్నరీ డాక్టర్ రాంబాబు తెలిపారు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతాయని చెప్పారు. క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందన్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సూచిస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని చెబుతున్నారు.