News February 1, 2025
వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News November 1, 2025
BHPL: యాత్రికుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక టూర్స్

భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక టూర్స్ & ప్యాకేజీలను నవంబర్ నెలకు ప్రకటిస్తున్నట్లు డిపో మేనేజర్ హిందూ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. భక్తి, పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తూ, సౌకర్యవంతమైన బస్సులతో ఈ యాత్రలు నిర్వహిస్తారన్నారు. ఈ యాత్రలకు భక్తులు, పర్యాటకులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు భూపాలపల్లి డిపోను సంప్రదించాలన్నారు.
News November 1, 2025
సిబ్బందికి విజయనగరం ఎస్పీ కీలక ఆదేశాలు

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అధికారులకు శనివారం ఆదేశించారు. భక్తులు పోలీసు సూచనలు పాటించాలని కోరారు. అవసరమైతే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, క్యూలైన్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ తెలిపారు.
News November 1, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన IAS, IPS, IRS, IES, ISS అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో DFO ప్రశాంత్ బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ కాజల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అధికారులు పాల్గొన్నారు.


