News February 1, 2025
వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News November 15, 2025
ప్రజాస్వామ్య విలువలు పతనం: జగన్

AP: హిందూపురంలోని YCP కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు <<18297222>>దాడి<<>> చేశారని జగన్ ట్వీట్ చేశారు. ‘ఈ అనాగరిక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నీచర్, అద్దాలను పగలగొట్టడం, కార్యకర్తలపై దాడి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుందని అన్నారు.
News November 15, 2025
MBNR: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి- కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకితో పాటు పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, నేషనల్ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే నేషనల్ హైవే 44, 167 పై బ్లాక్స్పాట్స్ గుర్తించి సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
News November 15, 2025
SBI కస్టమర్లకు BIG ALERT

SBI కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30 తర్వాత ఆన్లైన్, యోనో లైట్ ద్వారా డబ్బును పంపే, క్లెయిమ్ చేసే mCASH సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. UPI, IMPS, NEFT, RTGS తదితర డిజిటల్ పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం కోసం mCASHను గతంలో SBI తీసుకొచ్చింది.


