News August 22, 2024

వర్షంలోనే అచ్యుతాపురానికి చేరుకున్న చంద్రబాబు

image

విశాఖ KGHలో క్షతగాత్రులు, చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అచ్యుతాపురం సెజ్‌కు బయల్దేరారు. ఇదే సమయంలో వర్షం మొదలైంది. వానలోనే సీఎం ప్రమాదం జరిగిన ఎసెన్సియల్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చంద్రబాబుకు వివరించారు.

Similar News

News November 16, 2025

కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

image

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు

News November 16, 2025

జగదాంబ జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

జగదాంబ జంక్షన్‌లోని బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.

News November 16, 2025

విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

image

జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్‌లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.