News July 20, 2024

వర్షానికి పొలాల్లో నిలిచిన నీరు.. జాగ్రత్తలు పాటించండి!

image

ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలుస్తోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది, పత్తి, జొన్న, పెసర, మినుముతో పాటు వరి, మిరప, ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షం నీరు నిలవకుండా మురుగుకాల్వలు ఏర్పాటుచేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 17, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} జిల్లాలో నేటి నుంచి స్కూళ్లలో తనిఖీలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News November 17, 2025

లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం: CP

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్‌ అదాలత్‌‌కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు-605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా రూ.92,45,636 బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.

News November 16, 2025

స్థిరాస్తి లాటరీల మోసం.. అధికారులు దృష్టి సారించాలి

image

ఖమ్మం జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘1000 కట్టు-ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత ప్రకటనలతో లాటరీలు నిర్వహిస్తూ ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆర్థిక మోసాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమాయక ప్రజలను ఈ మోసాల నుంచి రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.