News July 20, 2024
వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరద ప్రవాహాల వద్దకు సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదాలకు బారిన పడవద్దని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేసి సాయం పొందాలని, శిథిలావస్థకు వచ్చిన నివాసాల్లో ఉండవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు వద్దకు వెళ్లకూడదన్నారు.
Similar News
News October 1, 2024
జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ నమోదుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
News October 1, 2024
డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన నల్గొండ జిల్లా
నిన్న వెల్లడైన డీఎస్సీ ఫలితాలలో నల్గొండ జిల్లా వాసులు సత్తా చాటారు. పిల్లి సైదులు(గట్లమల్లేపల్లి)1వ ర్యాంక్ పీఈడీ, పల్లెభవాని (మునుగోడు) జీవశాస్త్రం1వ ర్యాంక్, హనుమంతు అనిల్ (త్రిపురారం) వ్యాయామం 2వ ర్యాంక్, ఎండీ కలీమెద్దీన్ (చిట్యాల) హిందీ 2వ ర్యాంక్, విజయేంద్రచారి (హాలియా) సోషల్ 4వ ర్యాంక్, వలిశెట్టి యాదగిరి (ఆకారం) సోషల్ 5వ ర్యాంక్ సాధించారు.
News October 1, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.