News March 19, 2025
వర్సిటీకి ఇక మిగిలేది కేవలం 1400 ఎకరాలే!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కోసం ప్రభుత్వం 1974లో 2300 ఎకరాలు కేటాయించింది. అయితే వర్సిటీ ఏర్పాటైన 50 ఏళ్లలో వివిధ అవసరాల కోసం 500 ఎకరాలను వెనక్కుతీసుకున్నారు. ఆ తరువాత ఆ భూముల జోలికి రాలేదు. ఇపుడు మరోసారి ప్రభుత్వం HCU వద్ద 400 ఎకరాల లాగేసే ప్రయత్నం చేస్తోంది. అలా చేస్తే ఇక హెచ్సీయూ వద్ద మిగిలేది కేవలం 1400 ఎకరాలే.
Similar News
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.
News November 17, 2025
HYD: 3 ప్రమాదాలు.. 25 రోజులు..83 మంది

ఒక్కరు.. ఇద్దరు కాదు.. 83 మంది దర్మరణం పాలయ్యారు. కేవలం 25 రోజుల వ్యవధిలో బస్సు ప్రమాదాల రూపంలో 83 మంది నగర వాసులు, శివారు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో అక్టోబర్ 24న 19 మంది, నవంబర్ 4న చేవెళ్లలో 19 మంది, ఈరోజు తెల్లవారుజామున సౌదీలో 45 మంది దుర్మరణం చెందారు. ఈ మూడు ఘోర రోడ్డు ప్రమాదాలన్నీ బస్సు ప్రమాదాలే కావడం గమనార్హం.


