News May 5, 2024
వలసదారులకు ఓటు వేయవద్దు: మాండ్ర

ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఇతర పట్టణాల నుంచి వచ్చి నందికొట్కూరు నుంచి పోటీచేసే వైసీపీ వలస దారుడైన అభ్యర్థికి ఓటు వేయవద్దని నిత్యం ప్రజల మధ్యనే ఉండే టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్యకు ఓటువేసి గెలిపించాలని నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని శివపురం, లింగాపురం, గోకవరం, ఎదురుపాడు, జడ్వారి పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Similar News
News November 12, 2025
ఈనెల 14న ఉమ్మడి జిల్లాస్థాయి విలువిద్య ఎంపిక పోటీలు

ఉమ్మడి కర్నూలు జిల్లా విలువిద్య ఎంపిక పోటీలను కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి కె.నాగరత్నమయ్య బుధవారం తెలిపారు. అండర్-21 బాలబాలికల విభాగంలో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు కృష్ణా(D) నూజివీడులో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు.
News November 12, 2025
కర్నూలులో గవర్నర్కు ఆత్మీయ స్వాగతం

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు కర్నూలు విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో విచ్చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు.
News November 12, 2025
కర్నూలు: 75 మందికి బంగారు పతకాలు

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ జరిగే రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. ఇంజినీరింగ్లో 15, PGలో 60మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నారు. Phdలో 283, PGలో 889, డిగ్రీలో 17,224 మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 394 మందికి పట్టాలు ఇవ్వనున్నారు. RU ఏర్పడినప్పటి నుంచి జరిగిన 3 స్నాతకోత్సవాలను VCలే నిర్వహించారు. తొలిసారి 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరవుతున్నారు.


