News January 28, 2025
వలసల నివారణపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

అధికారులు అలసత్వం వీడి వలసల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎంపీడీఓ, ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీవోలను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలు, వలసల నివారణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన చోట సీజనల్ హాస్టళ్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి పనులు కల్పించి వలసలను నివారించాలని సూచించారు.
Similar News
News January 9, 2026
పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ ఆదేశాలు

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు ప్రజలు సంతృప్తి చెందేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో రోజువారీ చెత్త సేకరణ జరగాలన్నారు. డ్రైన్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో డిప్యూటీ ఎంపీడీవోలు స్వయంగా పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
News January 9, 2026
1100కు ఫోన్ చేయవచ్చు: కలెక్టర్

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. అలాగే అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News January 9, 2026
శిథిలావస్థలో చరిత్ర గల శివాలయం

నందవరం మండలం రాయచోటిలో శ్రీకృష్ణదేవరాయల నాటి చరిత్ర కలిగిన శివాలయం ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పలుమార్లు ఈ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు లంకె బిందెల కోసం తవ్వకాలు జరిపి, ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరిపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామస్థులు, శివభక్తులు రెండేళ్లుగా ఆలయం పరిసరాలను శుభ్రం చేస్తూ కాపాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా రక్షణ కల్పించాలని కోరారు.


