News March 20, 2025
వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

పాలకుర్తి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2024 మే 17 నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 31, 2025
BREAKING: రేపు సెలవు ప్రకటన

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు) ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. అటు తెలంగాణలో రేపు పబ్లిక్ హాలిడే ఉంది.
News March 31, 2025
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News March 31, 2025
నల్గొండ జిల్లాలో భక్తిశ్రద్ధలతో.. ఈద్ ఉల్ ఫితర్

రంజాన్ పండుగను పురస్కరించుకుని నల్గొండ జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ పండుగను సోమవారం ముస్లింలు సంతోషంగా నిర్వహించుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. మసీదు, ఈద్గాలు, తదితర చోట్ల వద్ద ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.