News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. వైసీపీ సోషల్ మీడియా పోస్ట్లు వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425460289_1127-normal-WIFI.webp)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం ఉదయం ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఆయనకు మద్దతుగా #WE STAND WITH VALLABHANENI VAMSI’ అంటూ హాష్ ట్యాగ్ను Xలో వైరల్ చేస్తోంది.
Similar News
News February 13, 2025
గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది కి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739453419620_52324495-normal-WIFI.webp)
పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ మండలాల అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. మునిసిపల్ కమిషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలతో అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి అధికారి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలన్నారు. అలాగే జిల్లాలోని వివిధ మండలాల పౌరుల కేటా, తప్పిపోయిన పురోగతిని మెరుగుపరచాలన్నారు.
News February 13, 2025
మహబూబాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వల్లబు వెంకటేశ్వర్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739458115712_51261400-normal-WIFI.webp)
మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కేసముద్రం పట్టణానికి చెందిన వల్లభు వెంకటేశ్వర్లును ఎన్నుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ, అనుబంధ సంస్థలలో పనిచేసిన ఆయన సుదీర్ఘ అనుభవంతో పార్టీని బలోపేతం చేసినందుకు గాను వెంకటేశ్వర్లును నియమించినట్లు తెలిపారు.
News February 13, 2025
కామారెడ్డి: వాలంటైన్స్డే బజరంగ్దళ్, వీహెచ్పీ హెచ్చరిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739456904575_52130988-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లాలో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా భజరంగ్దళ్, వీహెచ్పీ కార్యకర్తలు కీలక ప్రకటన చేశారు. పాశ్చాత్య దేశాల సంప్రదాయాలు ప్రభావం మనదేశంలో పడకుండా చూడాలని కోరారు. ప్రేమ ముసుగులో వికృత చేష్టలు చేపడుతున్న యువతకు కళ్ళు తెరిపించి మంచి బుద్ధితో ఉండాలని సూచించారు. దేశ సేవకు ముందుకు రావాలని కోరారు. యువత, స్టూడెంట్ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడానికి వీలుండదని హెచ్చరించారు.