News August 3, 2024

వల్లభనేని వంశీ ఎక్కడ.?

image

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. నిన్న వంశీ అరెస్ట్ అయ్యారంటూ ప్రచారం సాగినప్పటికీ పోలీసులు ఖండించారు. వంశీ అమెరికాలో ఉన్నారా, ఇండియాలోనే ఉన్నారా అనే అంశంపై ఆయన సన్నిహితుల వద్ద సైతం సమాధానం లేదు. కాగా గన్నవరం TDP కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనలో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. 

Similar News

News October 8, 2024

విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం

image

విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆగి ఉన్న ట్రక్కును వీరి బస్సు ఢీకొనగా.. ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 11మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఘటన జరగ్గా.. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడ నుంచి 80మంది స్టడీ టూర్ కోసం వెళ్లినట్లు సమాచారం.

News October 8, 2024

అవనిగడ్డలో జాబ్ మేళా.. రూ.18వేల వరకు వేతనం

image

అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18- 29 ఏళ్లలోపువారు హాజరు అవ్వొచ్చన్నారు. ఇందులో పలు ప్రముఖ కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఎంపికైన వారికి రూ.10- 18 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని విక్టర్ బాబు చెప్పారు.

News October 8, 2024

కృష్ణా: M.Com పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో M.Com(అకౌంటెన్సీ & బ్యాంకింగ్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 22 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 22 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.