News April 15, 2025
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ అప్డేట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ SC, ST కోర్టు మంగళవారం విచారించింది. విచారణలో భాగంగా పటమట పోలీసులు కౌంటర్ సమర్పించారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News December 2, 2025
2వ రోజు 383 నామినేషన్లు దాఖలు.!

ఖమ్మం జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 6 మండలాల్లో సోమవారం సర్పంచ్ల పదవికి 383.. వార్డులకు 895 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో కలిపి కామేపల్లిలో S-49 W-142, KMM(R) S-65 W-167, KSMC S-87 W-153, MGD S-78 W-160, NKP S-70 W-155, T.PLM S-79 W-154 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో 2వ విడత నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.
News December 2, 2025
నల్గొండ: బంగారిగడ్డ ఎన్నికపై డీపీఓ వివరణ

చండూరు మండలం బంగారిగడ్డ ఎన్నికపై డీపీఓ వివరణ ఇచ్చారు. ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్ ప్రక్రియ.. 30వ తేదీ నాడు నామినేషన్ల పరిశీలన కూడా చేశామని.. ఈ నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. సర్పంచి బరిలో 11 మంది ఉన్నారని.. పది వార్డు స్థానాలకు 26 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని తెలిపారు. ఇప్పటి వరకు సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎవరూ కూడా ఉపసంహరించుకోలేదని చెప్పారు.
News December 2, 2025
తాళ్లరేవులో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ప్రపోజల్

విమాన సర్వీసుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కింజరాపు రామ్మోహననాయుడును అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి కోరారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయనను హరీశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తాళ్లరేవు కోరింగ గ్రామంలో నూతన విమానాశ్రయం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కోరారు.


