News July 27, 2024

వల్లూరు: ట్రాక్టర్ కింద పడి విద్యార్థిని మృతి

image

వల్లూరు మండల పరిధిలోని పెద్దపుత్తలో శనివారం సాయంత్రం ట్రాక్టర్ కింద పడి విద్యార్థిని మృతి చెందింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న రెడ్డెమ్మ అనే బాలిక పాఠశాల ముగిసిన అనంతరం సైకిల్లో ఇంటికి వస్తుండగా రాళ్ళ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని ఎస్సై వెంకటరమణ పరిశీలించారు.

Similar News

News November 23, 2025

కడప జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి.!

image

ముద్దునూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు శనివారం కత్తితో దాడి చేసినట్లు స్థానిక SI తెలిపారు. ముద్దనూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ పనుల విషయంలో ఈ దాడి జరిగిన ఎస్సై వివరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News November 23, 2025

పొద్దుటూరు పోలీసుల చర్యతో ప్రజల్లో ఆందోళన..!

image

కొద్ది రోజులక్రితం ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాలరెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే శుక్రవారం రాత్రి పొద్దుటూరులో మరో బంగారు వ్యాపారి శ్రీనివాసులును కూడా కిడ్నాప్ చేశారు. ఈ మేరకు ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు 24 గంటలు కుటుంబ సభ్యులకు, మీడియాకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపనలు ఉన్నాయి. శ్రీనివాసులును రక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు.

News November 22, 2025

కడప: ‘27 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు’

image

YVU పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణారావు తెలిపారు. MA, Mcom, Msc, ఎం.పి.ఎడ్ మూడో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27, 29, డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయన్నారు.