News February 4, 2025
వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.
Similar News
News November 11, 2025
షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్నెస్పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్నెస్పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.
News November 11, 2025
వరద బాధిత కుటుంబాలకు ₹12.99 కోట్ల సాయం

TG: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా ₹12.99 కోట్లు అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు, వరదల్లో 15 జిల్లాల్లో 8662 ఇళ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్లు నివేదికలు పంపారు. ఈ ఇళ్ల యజమానులకు ₹15,000 చొప్పున అందించనున్నారు. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అక్టోబర్ 27-30 వరకు వరుసగా 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలతో ఈ నష్టం వాటిల్లింది.
News November 11, 2025
‘న్యూమోనియా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి’

ఈనెల 12న ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా 12 నుంచి 18 వరకు న్యూమోనియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DMHO డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ మంగళవారం వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని 64 పీహెచ్సీల పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ తదితర శాఖలతో కలిసి ర్యాలీలు, శిబిరాలు నిర్వహించాలన్నారు. న్యూమోనియా వ్యాధి లక్షణాలు, చికిత్స, నిరోధక చర్యల గురించి ప్రజలకు వివరించాలన్నారు.


