News February 4, 2025
వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.
Similar News
News September 15, 2025
పులిపాటి వెంకటేశ్వర్లు మన తెనాలి వారే

తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా తెనాలిలో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచుకున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, తదితర పాత్రలను పోషించడమే కాక,1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణి, హరిశ్చంద్ర తదితర 12 సినిమాల్లో నటించారు.
News September 15, 2025
తొలి తెలుగు కథానాయకుడు, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నటుడు

తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు వల్లూరి వెంకట సుబ్బారావు గుంటూరు జిల్లా మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన మునిపల్లె సుబ్బయ్య గుర్తింపు పొందారు. ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందారు. సెప్టెంబర్ 15 1931లో తొలి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద”లో హిరణ్యకశపునిగా నటించి చరిత్ర సృష్టించారు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి చరిత్రలో నిలిచిపోయారు.
News September 15, 2025
VZM: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.