News February 4, 2025

వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.

Similar News

News October 15, 2025

NLG: జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీవోలు

image

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీవోలుగా విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.

News October 15, 2025

నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టానని, తన పోటీ ముఖ్యం కాదన్నారు. 150కి ఒక్క సీటు తగ్గినా ఓటమిగానే భావిస్తామని స్పష్టం చేశారు. బిహార్‌లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కొద్ది నెలల క్రితమే పీకే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. మొత్తం 243 స్థానాలకు గాను ఇప్పటికే 116 మంది అభ్యర్థులను ప్రకటించారు.

News October 15, 2025

నవంబర్ 1 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి భక్తుల కోసం నవంబర్ 1 నుంచి భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దీక్షలు ప్రారంభమవుతాయి. భక్తులు నవంబర్ 5 వరకు దీక్షలు స్వీకరించవచ్చు. అర్ధ మండల దీక్షలు నవంబర్ 21 నుంచి మొదలవుతాయి. భవానీ దీక్షల విరమణ కార్యక్రమం డిసెంబర్ 11న ప్రారంభమై, 15న పూర్ణాహుతితో ముగుస్తుంది.