News February 4, 2025
వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.
Similar News
News November 28, 2025
కంటోన్మెంట్లో నామినేటెడ్ పదవి కోసం బీజేపీ నేతల పోటీ !

కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ పదవి కాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతల్లో పోటీ పెరిగింది. గత ఉపఎన్నికల్లో అభ్యర్థి డా. వంశీతిలక్ ఈసారి ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని కోరగా, బొల్లారానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కిరణ్కుమార్ ముదిరాజ్ పదవిని ఆశిస్తున్నారు. దీంతో పలువురు సీనియర్ నాయకులు ఎంపీ ఈటలను కలుస్తున్నారు. ఈ కీలక నామినేటెడ్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.
News November 28, 2025
ఏలూరు: మరో మూడు రోజులే గడువు

పీఎంఏవై (గ్రామీణ) – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేనివారు, స్థలం లేని నిరుపేదలు, అసంపూర్తిగా ఇళ్లు ఉన్నవారు ఈ నెల 30లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ‘ఆవాస్ ప్లస్’ యాప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, అర్హులు వెంటనే స్పందించాలని ఆయన సూచించారు.
News November 28, 2025
వరంగల్: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.


