News December 18, 2024
వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించండి: కలెక్టర్
ఎస్సీ, బీసీ ఇతర సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి చేపట్టాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత సంక్షేమ అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News January 19, 2025
హత్య కేసులో ఏడుగురు అరెస్ట్: డీఎస్పీ
చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామంలో ఖాజీపురం రామాంజనేయులు హత్య కేసులో ప్రధాన నిందితులు తలారి సురేశ్, కృష్ణమూర్తితో పాటు మరో ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఆలూరు సీఐ వెంకట చలపతి, ఎస్ఐ సతీశ్ కుమార్తో కలిసి మీడియా ముందు వివరాలు వెల్లడించారు. ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
News January 19, 2025
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్ చేశారు. వచ్చే నెల 6, 7, 8, 9వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలకు నంద్యాల జిల్లా నుంచి యువతీ, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని సీపీఐ కార్యాలయంలో నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
News January 18, 2025
పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్
నంద్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను శనివారం DAHO డా.గోవింద్ నాయక్తో కలిసి కలెక్టర్ జీ.రాజకుమారి ఆవిష్కరించారు. ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించే ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.