News February 22, 2025

వాంకిడిలో పశువుల వాహనం పట్టివేత

image

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని శుక్రవారం ఉదయం పట్టుకున్నట్లు వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ఎస్సైకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో ఎస్సై ప్రశాంత్ పోలీస్ సిబ్బందితో కలసి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా బులేరో వాహనంలో మహారాష్ట్రలోని గడ్చిరోలీ వైపు నుంచి హైదరాబాద్ మార్కెట్‌లో విక్రయించేందుకు 12 ఎద్దులను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News March 22, 2025

ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

image

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

News March 22, 2025

IPL: టాప్‌లో వీరే..

image

★ అత్యధిక పరుగులు-కోహ్లీ(8004)
★ అత్యధిక వికెట్లు- చాహల్(205)
★ అత్యధిక సార్లు విజేత-ముంబై, చెన్నై(ఐదేసి సార్లు)
★ అత్యధిక ఫోర్లు- శిఖర్ ధవన్(768)
★ అత్యధిక POTM అవార్డులు- ఏబీ డివిలియర్స్(25)
★ అత్యధిక టీమ్ స్కోరు-SRH(287/3)
★ అత్యధిక సెంచరీలు-కోహ్లీ(8)
★ అత్యధిక అర్ధసెంచరీలు-వార్నర్(66)

News March 22, 2025

భీమడోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

భీమడోలు రైల్వే గేట్ శ్రీకనకదుర్గమ్మ టెంపుల్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనపై ఎస్ఐ సుధాకర్ వివరాల ప్రకారం.. పెదవేగి (M) వేగివాడకు చెందిన ఘంట భరత్ (21), చల్లా సుబ్రహ్మణ్యం మిత్రులన్నారు. ఇద్దరూ బైక్‌పై తాడేపల్లిగూడెం వెళుతుండగా భీమడోలులో వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టిందన్నారు. ఘటనలో భరత్ మృతి చెందగా.. సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.

error: Content is protected !!