News December 19, 2024
వాంకిడి: కుల బహిష్కరణ కేసులో 8 మందికి జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734545232232_51374811-normal-WIFI.webp)
కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన 8 మందికి నెల రోజుల జైలు శిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ స్పెషల్ PDR కోర్టు ADB జడ్జి దుర్గారాణి బుధవారం తీర్పునిచ్చారు. వాంకిడిలోని రాంనగర్కు చెందిన ఆత్మారాం అతడి కుమారుడికి మధ్య భూ తగాదాలు జరగడంతో వారిని కుల పెద్దలు 4ఏళ్ల పాటు కులం నుంచి బహిష్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 2020మే20న వారిపై SHO రమేశ్ కేసు నమోదు చేయగా వారికి బుధవారం జడ్జి శిక్ష విధించారు.
Similar News
News January 14, 2025
జాతరకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736845846085_50150803-normal-WIFI.webp)
సారంగాపూర్ మండలం పొట్య గ్రామ పంచాయతీ పరిధిలోని బండ్రేవు తండాలో నాను మహరాజ్ జాతర ఉత్సవాలకు బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాను మహారాజ్ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, దావుజీ, ప్రకాష్,జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2025
భీమారం: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక దుర్మరణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736833082238_50225406-normal-WIFI.webp)
ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల అద్వైకరాజ్ దుర్మరణం చెందింది. మంతెన రాజ్ కుమార్ తన భార్య సురేఖ, కుమార్తె అద్వైకరాజ్, తల్లి లక్ష్మమ్మ, మేనకోడలు తేజశ్రీతో కలిసి తమిళనాడులోని ఒక చర్చికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా కారు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
News January 14, 2025
ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736770690970_50249255-normal-WIFI.webp)
డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరం స్పెల్-II, ఓల్డ్ బ్యాచ్ 2016 అంతకుముందు బ్యాచ్ల వారు అలాగే రీ అడ్మిషన్ తీసుకున్న వారు సప్లిమెంటరీ ఫీజును ఈ నెల ఈనెల 14వరకు చెల్లించవచ్చన్నారు. ఇందుకు రూ. 500 అపరాధ రుసుం కట్టాలన్నారు.