News February 10, 2025
వాంకిడి: బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు: ఎస్ఐ

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామని ఎస్ఐ ప్రశాంత్ అన్నారు. వాంకిడి టోల్ ప్లాజా వద్ద వెటర్నరీ వైద్యులతో కలిసి జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలను వెనక్కి తిప్పి పంపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ రవాణాను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 24, 2025
PDPL: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు.
News March 24, 2025
అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 202 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్షకు 202 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,681 హాజరైనట్లు చెప్పారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 685 మంది హాజరు కావలసి ఉండగా 576 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
News March 24, 2025
‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్వదినియోగం చేసుకోండి’

ఏప్రిల్ 5లోపు రాజీవ్ యువ వికాసం పథకానికి బీసీ, ఈబీసీ, EWS నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందని, దీనిని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.