News August 9, 2024
వాకాడు: ‘జనసేన నేతపై దాడిని ఖండిస్తున్నాం’

వాకాడు మండల జనసేన పార్టీ నేత రౌతు శివకుమార్పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షడు, లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బాధితుడిని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండంలోని ఓ పార్టీకి చెందిన నేతలు ఈ దాడికి పాల్పడ్డారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేయాలన్నారు.
Similar News
News December 20, 2025
కాకాణి మైనింగ్ కేసు… A2 శివారెడ్డికి రిమాండ్

మాజీమంత్రి కాకాణి అక్రమ మైనింగ్ కేసులో A2గా ఉన్న శివారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ అడ్డుకున్న గిరిజనులను బెదిరించాడన్న ఆరోపణల కేసులో ముద్దాయిగా చేర్చడంతో.. 10 నెలలుగా పరారీలో ఉన్నారు. అతడిని తాజాగా అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం గూడూరు మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. న్యాయ స్థానం ఆయనకు జనవరి 2 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది.
News December 20, 2025
నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

నెల్లూరు జిల్లాలో హైరిస్క్ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.
News December 20, 2025
నెల్లూరు: వైసీపీలోనే ఆ ముగ్గురు..!

TDPకి షాక్ ఇచ్చిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగనున్నారు. మాజీ మంత్రి అనిల్ ఆధ్వర్యంలో మద్దినేని మస్తానమ్మ, కాయల సాహిత్య, వేనాటి శ్రీకాంత్రెడ్డిలు YS జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్రెడ్డిని సిటీ ఆఫీసులో కలిశారు. వైసీపీతోనే తమ పయనం సాగుతుందని TDPలో తమకు ఎటువంటి విలువ లేకుండా పోయిందని తెలిపారు.


