News August 9, 2024
వాకాడు: ‘జనసేన నేతపై దాడిని ఖండిస్తున్నాం’

వాకాడు మండల జనసేన పార్టీ నేత రౌతు శివకుమార్పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షడు, లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బాధితుడిని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండంలోని ఓ పార్టీకి చెందిన నేతలు ఈ దాడికి పాల్పడ్డారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేయాలన్నారు.
Similar News
News December 16, 2025
నెల్లూరు జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్ల వారీగా విభజించే క్రమంలో నెల్లూరు జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.
News December 16, 2025
నేటి నుంచి పండగ (ధనుర్మాసం ) నెల ప్రారంభం

నేటి నుంచి ధనుర్మాసం రావడంతో పండగ నెల ప్రారంభం అయినట్లు ప్రముఖ పండితులు లోకా అనంత వెంకట మురళీధర్ శాస్త్రి తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంచు తెరలు ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. పండుగ నెల ప్రారంభం కావడంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలతో తీర్చిదిద్దునున్నారు. గుమగుమలాడే వివిధ రకాల పిండి వంటలు చేసే పనులు నిమగ్నం అవుతారు.
News December 16, 2025
ఇంకా గోవాలోనే కార్పొరేటర్లు, 18న నెల్లూరుకు రాక

నెల్లూరు కార్పొరేషన్లోని కార్పొరేటర్లు అందరూ ఇంకా గోవాలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 38 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు గోవాకు వెళ్లారు. తిరిగి 17వ తేదీ తిరుపతికి వస్తారు. అక్కడి నుంచి 18వ తేదీ ఉదయానికి కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరవుతారు. అవిశ్వాస తీర్మానం లేకపోవడంతో సాధారణ సమావేశం జరగనుంది.


