News July 14, 2024
వాజేడు: జలపాతం వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు

వరద ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జలపాతం సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా వాజేడు పోలీసుల ఆధ్వర్యంలో ప్లెక్సీలతో సూచనలు చేశారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్ఐ హరీశ్, పోలీస్ సిబ్బంది బొగత జలపాతం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News January 5, 2026
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సత్తుపల్లి, వైరా, ఖమ్మం అర్బన్ ప్రాంతాల నుంచి భూ వివాదాలు, పర్యావరణం, మున్సిపల్ సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీటిని ఆయా విభాగాలకు బదిలీ చేస్తూ.. నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 5, 2026
ఖమ్మం ఐటీ హబ్లో ఉచిత శిక్షణ

ఖమ్మం ఐటీ హబ్లో నిరుద్యోగ యువతకు వివిధ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు. జావా, పైథాన్, ఒరాకిల్ ఎస్క్యూఎల్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో నైపుణ్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 13వ తేదీ లోపు ఐటీ హబ్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
News January 5, 2026
KMM: అవినీతి రహిత సేవలే లక్ష్యం: మంత్రి పొంగులేటి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 దశల్లో 94 కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా మరో 10 సమీకృత భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ సంస్కరణల వల్ల అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు.


