News February 16, 2025

వాజేడు: ‘వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఆదివాసీ విద్యార్థి మృతి’

image

వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాలలో గత కొన్ని రోజులు నుంచి 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్(14) జ్వరంతో బాధపడుతున్నా హెచ్ఎం, వార్డెన్ ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవరించారని, అతడికి సరైన చికిత్స అందించలేదని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పునెం సాయి మండిపడ్డారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, నిర్లక్ష్యంగా ఉన్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 21, 2025

విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

image

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్‌ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్‌ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్‌ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.

News November 21, 2025

మేడారం: శబరీష్‌కు నిరాశే..!

image

మేడారం మహా జాతరను ఒక్క సారైన తమ చేతుల మీదుగా జరిపించడాన్ని ఐపీఎస్ అధికారులు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. రెండు సార్లు అవకాశం దక్కించుకున్న వారూ ఉన్నారు. 2024 జాతరలో అన్నీ తానై వ్యవహరించిన శబరీష్ 2026 జాతరకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. కొత్త రోడ్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు చేయిస్తున్నారు. అయితే అరుదైన అవకాశానికి అడుగు దూరంలో జాతరకు రెండు నెలల ముందు బదిలీ అయ్యారు. ఓ రకంగా ఆయనకు నిరాశే ఎదురైంది.

News November 21, 2025

వేములవాడ: సాధారణ కుటుంబం నుంచి ఐపీఎస్..!

image

వేములవాడ <<18349816>>ఏఎస్పీగా<<>> నియమితులైన కొట్టే రిత్విక్ సాయి సామాన్య కుటుంబం నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగారు. వరంగల్‌కు చెందిన ఈయన.. శ్రీనివాస గురుకుల్ పాఠశాలలో టెన్త్ వరకు, HYDలో ఇంటర్, ఢిల్లీ శివనాడార్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. 2023వ బ్యాచ్‌లో TG క్యాడర్ IPS అధికారిగా ఎంపికయ్యారు. తండ్రి రాధాకృష్ణారావు లైబ్రేరియన్, తల్లి గృహిణి, సోదరి వైద్యురాలిగా పనిచేస్తారు.