News April 15, 2025
వాజేడు వ్యాప్తంగా కరపత్రాల కలకలం!

ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా గిరిజన యువజన సంఘం పేరిట కరపత్రాలు వెలిశాయి. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, కడేకల్, పేరూరు, వాజేడు పరిధిలోని కొప్పుసురు, మురుమూరు, ప్రగల్లపల్లి ప్రాంతంలో కరపత్రాలు వెలువడటంతో బయానక వాతావరణం ఏర్పడింది. అడవుల్లో బాంబులు గిరిజన గుండెల్లో గుబులు, ఎంత కాలం ఈ అరాచకాలు అంటూ కరపత్రాల్లో రాశారు.
Similar News
News October 20, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేదారేశ్వర నోముల సంబరాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేదారేశ్వర నోములు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో కేదారేశ్వరుడికి పూజలు అర్పించి కుటుంబ శ్రేయస్సు, ధనసంపద కోసం ప్రార్థించారు. గ్రామాలంతా హారతుల కాంతులతో కళకళలాడగా, నోముల పాటలు, వంటల సువాసనలతో భక్తి వాతావరణం నెలకొంది. ఈసారి అమావాస్య రెండ్రోజులు రావడంతో కొందరు నేడు, మరి కొందరు మంగళవారం నోముకుని బుధవారం ఎత్తుకోనున్నారు. మీ నోములు ఎప్పుడు?
News October 20, 2025
జగిత్యాల జిల్లాకు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్ జారీ

రానున్న 2-3 గంటల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. రైతులు, ప్రజలు వర్షం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News October 20, 2025
బిహార్ తొలి విడత ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ నిధులు విడుదల?

దీపావళి సందర్భంగా కేంద్రం PM కిసాన్ 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వార్తలు వచ్చినా మోదీ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ.2వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా పేర్కొంది. బిహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు (నవంబర్ 6) ముందు కేంద్రం దీనిపై ప్రకటన చేయవచ్చని తెలిపింది. ఈ-కేవైసీ పూర్తి కాని రైతులకు డబ్బులు జమ కావని వివరించింది.