News November 28, 2024

వాటికి అనుమతులు తప్పనిసరి: ప.గో DMHO

image

ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫిజియోథెరఫీ సెంటర్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్‌లు నిర్వహించడం నేరమని ప.గో జిల్లా DMHO డి.మహేశ్వరరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్నీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆయా సెంటర్ల వద్ద పరీక్షల ఫీజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News November 24, 2025

ప.గో. జిల్లాలో 7 ఇసుక స్టాక్ పాయింట్స్: కలెక్టర్

image

జిల్లాలో పెద్దఎత్తున 7 ఇసుక నిల్వల స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఇంజనీరింగ్ సిబ్బంది ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను తీసుకోవాలన్నారు. తల్లికి వందనం సంబంధించి పెండింగ్‌లో ఉన్న 1,465 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ రాహుల్, డీఆర్ఓ శివన్నారాయణరెడ్డి ఉన్నారు.

News November 24, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో ఇల్లు రీసర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News November 24, 2025

భీమవరం: మానసిక రోగుల గుర్తింపుపై పోస్టర్‌ ఆవిష్కరణ

image

మానసిక రోగుల గుర్తింపు, చికిత్స, పునరావాసం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మనోబంధు ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్‌ను ఎస్పీ నయీం అస్మి ఆవిష్కరించారు. సోమవారం ప.గో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో వీరి వల్ల నేరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు.