News March 29, 2025

వాట్సప్ గవర్నెన్స్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, స్మార్ట్ ఫోన్ లోనే సులభంగా సేవలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరిట వాట్సప్ గవర్నెన్స్‌ను అమలులోకి తెచ్చిందన్నారు. దీని ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం 210 సేవలకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గోడ పత్రికల ద్వారా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News October 29, 2025

సూర్యాపేట: భారీ వర్షాలు.. కంట్రోల్ రూం ఏర్పాటు

image

మోంథా తుపాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 62814 92368 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

News October 29, 2025

NGKL: భారీ వర్షాలు… జూనియర్ కళాశాలలకు నేడు సెలవు

image

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, జిల్లా కేంద్రంలో రెడ్ అలర్ట్ ఉన్నందున కలెక్టర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఐఈవో వెంకటరమణ తెలిపారు. నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ సెలవుకు బదులుగా రాబోయే రెండవ శనివారం రోజున కళాశాలలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.

News October 29, 2025

సంగారెడ్డి: ఫ్యామిలీ గ్రూపులో మెసేజ్ పెట్టి భర్త అదృశ్యం

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన శ్రీధర్(24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహమైంది. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పెద్దల మధ్య పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్లిన భర్త తిరిగి రాలేదు. ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో తన చావుకు కారణం భార్య అని మెసేజ్ పెట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.