News April 15, 2025

వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర)పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులను ఆదేశించారు. వాట్సాప్ మన మిత్ర నంబర్ ద్వారా ఛాటింగ్ చేయవచ్చని, ఆ నంబర్ మొబైల్లో సేవ్ చేసుకుని హాయ్ అని పెట్టడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 161సేవలను ఇంట్లో నుండే పొందవచ్చన్నారు. ఈ యాప్‌పై సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News December 3, 2025

సంగారెడ్డి: సర్పంచ్ పదవికి 1,444 నామినేషన్లు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో 243 సర్పంచ్ స్థానాలకు 1,444 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం బుధవారం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు పోటీ చేసే అభ్యర్థులు పాటించాలని సూచించారు.

News December 3, 2025

తుఫాన్.. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లాకు వాతావరణ శాఖ బుధవారం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎల్లో అలర్ట్ తెలిపే ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. దీని ప్రభావంతో రానున్న 3గంటల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.

News December 3, 2025

నర్సంపేటకు వరాల జల్లు..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ఈ నెల 5న నర్సంపేట పర్యటనకు రానున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానం మేరకు సీఎం ఈ పర్యటనలో పాల్గొని దాదాపు రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.45 కోట్లతో నర్సింగ్ కాలేజీ, రూ.20 కోట్లతో సైడ్ డ్రైనేజీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.