News March 10, 2026
వాడిన నూనె వాడితే క్యాన్సర్ ముప్పు: రామయ్య

అమలాపురం హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను తిరిగి వాడటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ఆహార భద్రతా అధికారి రామయ్య హెచ్చరించారు. సోమవారం యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన నూనెను నిల్వ చేయరాదని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Similar News
News April 14, 2026
జనగామ: 94 మంది పంచాయతీ సెక్రటరీల బదిలీ

జనగామ జిల్లా వ్యాప్తంగా 94 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సెక్రటరీలు తమ కొత్త నియామక స్థానాల్లో 24 గంటల్లోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. గ్రామ పరిపాలనలో పారదర్శకత, పనితీరు మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఒకేసారి ఇంత భారీగా బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
News April 14, 2026
మాస్టర్ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి: శైలజా రామయ్యర్

కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాల పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. తాత్కాలిక పనులను 15 రోజుల ముందే పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులకు టెండర్లు పిలవాలని, పూర్తయిన వాటికి నిధులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.
News April 14, 2026
గుడ్న్యూస్ చెప్పిన LIC

ప్రభుత్వ బీమా సంస్థ LIC తమ ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్ చెప్పింది. 1:1 నిష్పత్తిలో బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపింది. రికార్డు తేదీ నాటికి వాటాదారులు కలిగి ఉన్న ప్రతి షేరుకు అదనంగా ఉచిత షేరును ఇవ్వనుంది. అంటే మీ వద్ద 100 షేర్లు ఉంటే బోనస్ తర్వాత అవి 200 షేర్లు అవుతాయి. రికార్డ్ డేట్ను త్వరలో ప్రకటించనుంది. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లో LIC లిస్ట్ అయింది.


