News February 15, 2025
వామ్మో ఎండ.. జిల్లాలోనే మేడిపల్లిలో TOP

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అర్బన్, సెమీ అర్బన్ ఏరియాల్లో ఎండ దంచి కొడుతోంది. జిల్లాలోని అత్యధికంగా మేడిపల్లిలో ఎండ తీవ్రత ఉన్నట్లు TGDPS తెలిపింది. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా గరిష్ఠంగా మేడిపల్లిలో 36.8° ఉష్ణోగ్రత నమోదైంది. మేడిపల్లి, ఘట్కేసర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Similar News
News November 18, 2025
తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
News November 18, 2025
తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
News November 18, 2025
MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.


