News December 20, 2024

వారిపై చర్యలు తీసుకోండి: అనంత ఎస్పీ ఆదేశం

image

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి డ్రైవింగే చేయడమే ప్రధాన కారణంగా ఉందని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాలు నడపకుండా ఆ కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే జరిమానాలను 3నెలల్లోపు చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

Similar News

News January 5, 2026

ఈ నెల 6, 7వ తేదీలలో ఇంటర్వ్యూలు

image

17 పారామెడికల్ కళాశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి GNM కోర్సులో అడ్మిషన్స్ కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO దేవి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 761 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కన్వీనర్ కోటాలో 594 సీట్లకు మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈనెల 6, 7వ తేదీలలో DMHO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని DMHO తెలిపారు.

News January 4, 2026

అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

image

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

News January 4, 2026

అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

image

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.