News December 20, 2024

వారిపై చర్యలు తీసుకోండి: అనంత ఎస్పీ ఆదేశం

image

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి డ్రైవింగే చేయడమే ప్రధాన కారణంగా ఉందని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాలు నడపకుండా ఆ కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే జరిమానాలను 3నెలల్లోపు చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

Similar News

News October 23, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

image

ఇటీవల అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో యాడికికి చెందిన విద్యార్థి తృషిత అత్యంత ప్రతిభ కనబరిచింది. దీంతో గుంతకల్ డివిజన్ జట్టుకు ఎంపికయింది. డివిజనల్ స్థాయి పోటీలలోనూ అత్యంత ప్రతిభ కనబరిచడంతో నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో తృషిత పాల్గొంటుంది.

News October 22, 2025

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

image

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO దేవి వైద్యులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన అర్జీలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వైద్య సేవలపై ప్రజల్లో మంచి దృక్పథం వచ్చేలా ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలను అందించాలన్నారు.

News October 22, 2025

పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

image

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.