News March 25, 2025
వారి వలలో పడకండి: అన్నమయ్య ఎస్పీ

నకిలీ రుణ మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇవి ఆన్లైన్లో జరుగుతున్నాయని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ప్రకటనలు చేస్తారు. రుణం కావాలంటే మీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాలని అడుగుతారు. రుణం మంజూరుకు ముందు కొంత డబ్బు చెల్లించాలని అడుగుతారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మోసం చేస్తారని చెప్పారు.
Similar News
News December 12, 2025
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
News December 12, 2025
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోం మంత్రి

చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హోం మంత్రి హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో హోం మంత్రి మారేడుమిల్లికి చేరుకోనున్నారు.
News December 12, 2025
BREAKING: మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని స్వగృహంలో ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ 2సార్లు MLA, ఏడుసార్లు MPగా గెలిచారు. ఇందిర, రాజీవ్, మన్మోహన్ క్యాబినెట్లలో డిఫెన్స్, సైన్స్ &టెక్నాలజీ, హోంమంత్రిగా పనిచేశారు. 10వ లోక్సభ స్పీకర్, పంజాబ్ గవర్నర్గానూ బాధ్యతలు నిర్వర్తించారు.


