News March 25, 2025
వారి వలలో పడకండి: అన్నమయ్య ఎస్పీ

నకిలీ రుణ మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇవి ఆన్లైన్లో జరుగుతున్నాయని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ప్రకటనలు చేస్తారు. రుణం కావాలంటే మీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాలని అడుగుతారు. రుణం మంజూరుకు ముందు కొంత డబ్బు చెల్లించాలని అడుగుతారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మోసం చేస్తారని చెప్పారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ప్రియరాలి వేధింపులతో ఆత్మహత్య?

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలు వేధింపులే కారణమని యువకుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా కొద్దిరోజుల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. మిత్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 25, 2025
పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.
News November 25, 2025
GNT: ఎండు మిర్చి రేట్లకు ఊపు.. రైతుల్లో నూతన ఆశ

రెండేళ్ల నష్టాల తరువాత ఎండు మిర్చి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. క్వింటాలు రూ.20 వేల దాటే సూచనలు కనిపిస్తున్నాయి. శీతల గోదాముల స్టాక్ తగ్గడం, కొత్త పంట మార్కెట్లో తక్కువగా వచ్చే అవకాశమే ప్రధాన కారణం. గత ఏడాది 3.64 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఈసారి 2.67 లక్షలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో నవంబర్ మూడో వారానికి మూడు రకాల మిర్చి ధరలు ఎగబాకాయి. క్వింటాకు రూ.18,600 వరకు నమోదైంది.


