News February 14, 2025
వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్ల లోపు బాలబాలికలు PM కేర్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 2020 మార్చి 11 నుంచి 2023 మే5 మధ్య కాలంలో కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన వారు మాత్రమే అర్హులన్నారు. ఇంతవరకు నమోదు చేసుకోని వారు వెంటనే PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 16, 2025
చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.
News September 16, 2025
గోపాలపట్నంలో దారుణ హత్య

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
పోషకాహారంతో ఆరోగ్యకర జీవనం: ములుగు కలెక్టర్

పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.