News February 14, 2025

వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్ల లోపు బాలబాలికలు PM కేర్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 2020 మార్చి 11 నుంచి 2023 మే5 మధ్య కాలంలో కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన వారు మాత్రమే అర్హులన్నారు. ఇంతవరకు నమోదు చేసుకోని వారు వెంటనే PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 7, 2025

కడియంలో “జనసేన”కేదీ ప్రాధాన్యత..?

image

కడియం మండలంలో జనసేనకి ప్రాధాన్యం తగ్గుతుందని ఆ పార్టీ శ్రేణులు అంతర్మధనంలో ఉన్నాయి. గతంలో మెజారిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానం గెలిచినా ఎంపీపీ పదవిని టీడీపీకి త్యాగం చేశారు. తాజాగా సొసైటీ ఛైర్మన్ల నియామకంలోనూ టీడీపీ మూడు దక్కించుకోగా, జనసేనకు ఒక్కటే దక్కింది. ఇప్పటికే రెండు పదవులున్న ఎంపీపీ బంధువుకే మళ్లీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు లోకల్‌గా టాక్ నడుస్తోంది.

News December 7, 2025

కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

image

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.

News December 7, 2025

ఆసిఫాబాద్: ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘణ.. పలువురిపై కేసు’

image

ఆసిఫాబాద్(M) మోతుగూడ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వినోద్‌కు మద్దతుగా ఎలాంటి అనుమతి లేకుండా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఎఫ్ఎస్టీ అధికారి ఫిర్యాదు మేరకు వినోద్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.