News March 21, 2024
వాలంటీర్లపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే క్రిమినల్ కేసులో నమోదు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి 4 రోజులు గడిచినా ఎన్నికల కోడ్కు సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. పోస్టర్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఈపాటికే తీసేసి ఉండాల్సిందన్నారు. ఇప్పటికి తీసేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.
News November 17, 2025
సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.


