News February 14, 2025
వాలంటైన్స్ డే.. మన రాజనర్సింహ లవ్ స్టోరీ

FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. మంత్రి, ఆందోల్ MLA దామోదర రాజనర్సింహ, పద్మినీరెడ్డి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో నిజామాబాద్లో మిత్రుడి పెళ్లికి వెళ్లి అక్కడ పద్మినీతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. స్నేహితుల సహాయంతో 1985లో ఇద్దరూ పెళ్లి చేసుకోగా ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు.
Similar News
News October 24, 2025
విశాఖ డేటా సెంటర్: TDP, YCP మధ్య ‘క్రెడిట్’ వార్!

AP: విశాఖలో ఏర్పాటయ్యే డేటా సెంటర్పై TDP, YCP మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. క్రెడిట్ తమదేనని రెండు పార్టీలు వాదిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్కు తమ హయాంలోనే ఒప్పందం జరిగిందని చెప్తున్నాయి. 2020 నవంబర్లో అగ్రిమెంట్, 2023 మేలో శంకుస్థాపన చేశామని మాజీ సీఎం జగన్ చెప్పడంపై TDP మండిపడింది. 2019లో చంద్రబాబు CMగా ఉన్నప్పుడే అదానీ గ్రూప్, AP ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు చెప్పింది. దీనిపై మీ కామెంట్?
News October 24, 2025
కేయూ పరిధిలో హాస్టల్ వసతికి దరఖాస్తులు ఆహ్వానం

కేయూపీజీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన ఫస్టియర్ విద్యార్థులు హాస్టల్ వసతి, మెస్ సదుపాయం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్.పీ.రాజ్కుమార్ సూచించారు. విద్యార్థులు https://kucolleges.co.in/hostels/new_admissions వెబ్సైట్లో ఫీజు చెల్లించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రశీదు జత చేయాలన్నారు. అదనంగా ఆధార్, కుల ధ్రువపత్రం, ఫొటోలు సమర్పించాలన్నారు.
News October 24, 2025
ఖమ్మంలో దారుణం.. బాలుడిపై లైంగిక దాడికి యత్నం

ఖమ్మం నగరంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఓ డివిజన్కు చెందిన ఏడో తరగతి విద్యార్థి (మైనర్)పై అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల మరో మైనర్ బాలుడు లైంగిక దాడికి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు వెంటనే ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


