News March 19, 2025

వాలీబాల్‌లో మంత్రి సవిత టీమ్ విజయం

image

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పోర్ట్స్ మీట్ -2025 మంగళవారం సందడిగా ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత నేతృత్వంలోని వాలీబాల్ టీమ్ మంత్రి అనిత టీమ్‌పై విజయం సాధించింది. పురుష ఎమ్మెల్యేలతో జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో మంత్రి సవిత ప్రాతినిధ్యం వహించిన మహిళల జట్టు విజయం సాధించింది. మహిళల టగ్ ఆఫ్ వార్‌లో మంత్రి సవిత టీమ్‌పై మంత్రి అనిత టీమ్ విజయం సాధించింది.

Similar News

News March 21, 2025

వేములవాడలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా విద్యార్థులు రాస్తున్న తీరును పరిశీలించి, పరీక్ష కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

News March 21, 2025

నల్గొండ: టోల్ విధించే ప్రసక్తే లేదు: మంత్రి కోమటిరెడ్డి

image

రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లకు టోల్ విధించే ఆలోచనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో సిద్దిపేట MLA హరీశ్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. కాగా, రోడ్లపై చర్చ జరుగుతున్న సందర్భంగా తమ వద్ద రోడ్లు సరిగ్గా లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ నవ్వుతూ అన్నారు.

News March 21, 2025

REWIND: ‘జనతా కర్ఫ్యూ’ గుర్తుందా?

image

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజున ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశమంతటా స్వచ్ఛంద బంద్‌కు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ విధించింది. ఎక్కడికక్కడ దేశం స్తంభించడంతో వలస జీవులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా మీపై ఎలాంటి ప్రభావం చూపింది? COMMENT

error: Content is protected !!