News November 11, 2024
వాల్తేర్ డీఆర్ఎంతో విజయనగరం ఎంపీ భేటీ.. చర్చించిన అంశాలివే..!

☛ కోమటిపల్లి రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్ను సీతానగరం స్టేషన్కు మార్చాలి
☛ బొబ్బిలిలో వందే భారత్కు హాల్టింగ్
☛ విజయనగరంలోని రైల్వే అండర్ పాస్ నిర్మాణంపై ఆరా
☛ పార్వతీపురం-గుమడ మధ్య ఫ్లైఓవర్ల నిర్మాణం
☛ కొత్తగా ప్రతిపాదించిన పాలకొండ-రాజాం రైల్వే లైన్ నిర్మాణ ప్రగతిపై ఆరా
☛ చీపురుపల్లి రోడ్డు ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ఎంపీ కోరగా సంక్రాంతి లోపు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
Similar News
News October 28, 2025
తుఫాన్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం: VZM SP

మొంథా తుఫాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు. కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటేటప్పుడు ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని, ప్రజలకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News October 28, 2025
తప్పుడు వార్తలతో వైరల్ చేస్తే తప్పవు: ఎస్పీ

తుపాన్ నేపథ్యంలో తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవని SP ఏ ఆర్ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మొంధా తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 28, 2025
అన్ని బృందాలు సిద్ధంగా ఉన్నాయి: డీఐజీ

మొంథా తుఫాను సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. బర్రిపేటలో సోమవారం ఆయన పర్యటించారు. తీరప్రాంతాల్లో మెరైన్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయం వచ్చే అవకాశం ఉందని, ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.


