News April 1, 2025

వాల్మీకిపురం: పదో తరగతి బాలికపై లైంగిక దాడి 

image

పదో తరగతి బాలికపై జేసీబీ డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన వాల్మీకిపురంలో వెలుగు చూసింది. పట్టణంలో ఉండే ఓమైనర్ బాలిక స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పక్క వీధిలో ఉండే జేసీబీ డ్రైవర్ బాలికపై లైంగిక దాడిచేశాడు. వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ చంద్రశేఖర్ రాత్రి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Similar News

News February 24, 2026

అనంతపురం: భార్యపై కొడవలితో దాడి చేసిన భర్త

image

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన అనంతపురంలో మంగళవారం జరిగింది. పాతూరులో నివాసం ఉంటున్న గౌరమ్మ తలపై భర్త నాగభూషణం కొడవలితో తీవ్రంగా దాడి చేశాడు. గాయపడ్డ ఆమెను స్థానికులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌరమ్మ చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న ఒకటవ పట్టణ పోలీసులు నిందితుడు నాగభూషణంను అదుపులోకి తీసుకున్నారు.

News February 24, 2026

ఖమ్మం: ‘నకిలీ’ ఉచ్చు.. కల్తీ దందాను అరికట్టేదెవరు?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ, కల్తీ వస్తువుల దందా విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యావసరాల నుంచి మందులు, విత్తనాలు, వరకు అన్నింటికీ నకిలీలు పుట్టుకొస్తున్నాయి. బ్రాండెడ్ పేర్లతో తక్కువ ధరకు నాసిరకం వస్తువులను అంటగడుతూ వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ దెబ్బతీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కల్తీ రాజ్యం మరింత విస్తరిస్తోంది.

News February 24, 2026

5min లేటైనా పరీక్షకు అనుమతి: ఇంటర్ బోర్డు

image

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ <<19217020>>పరీక్షలు<<>> జరగనున్నాయి. ఉ.9కి ఎగ్జామ్ ప్రారంభం కానుండగా పరీక్ష సమయానికి 5min లేటైనా విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. అటు APలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలి రోజు 5.24L మంది హాజరయ్యారు. నేడు సెకండియర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాగా APలో నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.