News December 23, 2024
వాళ్లను జగన్ మోసం చేశారు: నిమ్మల
కడప జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గండికోట జలాశయం పరిశీలన తర్వాత ఆయన మాట్లాడారు. ‘గండికోట నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని జగన్ చెప్పారు. కానీ ఐదేళ్లలో ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు మేము వాళ్లకు రూ.450 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. హంద్రీనీవాకు రూ.2500 కోట్లు కేటాయించాం. త్వరలో పనులు పూర్తి చేస్తాం’ అని నిమ్మల అన్నారు.
Similar News
News January 26, 2025
చెక్ పోస్టుల్లో కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించాలి: ఎస్పీ
కడప జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నిషేదిత పదార్థాలు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దువ్వూరు పీఎస్ పరిధిలోని ఇడమడక అంతర్ జిల్లా చెక్ పోస్ట్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News January 25, 2025
YS వివేకా ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యపై విజయసాయిరెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని, వెంటనే అవినాశ్ రెడ్డికి ఫోన్ చేయగా పక్కన ఉన్న వ్యక్తికి ఫోన్ ఇచ్చారన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారని, ఫోన్లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.
News January 25, 2025
పులివెందులలో YS జయమ్మ 18వ వర్ధంతి వేడుకలు
పులివెందులలో వైఎస్ జయమ్మ 18వ వర్ధంతి వేడుకలలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని డిగ్రీ కళాశాలలోని జయమ్మ సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైయస్ జార్జిరెడ్డి, సతీమణి వైయస్ భారతమ్మ, వైయస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్ సౌభాగ్యమ్మలు నివాళులు అర్పించారు.