News January 23, 2025
వికారాబాద్లో దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు

అర్హులైన దివ్యాంగులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి సూచించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా వారి పునరావాస పథకం కింద బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూ.50,000 సబ్సిడీ ఇస్తున్నారు. 24 యూనిట్లు ద్వారా రూ.12 లక్షల సబ్సిడీ మంజూరైంది. నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు అర్హులైన దివ్యాంగులు www.tg.obmms.cgg.gov.in ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 3, 2025
పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News December 3, 2025
సంగారెడ్డి: రేపు హాకీ ఉమ్మడి జిల్లా పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హాకీ బాలబాలికల అండర్-14, 17 ఉమ్మడి మెదక్ జిల్లా పోటీలు సంగారెడ్డిలోని అంబేద్కర్ మేధావులు నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్తో ఉదయం 9 గంటలకి హాజరుకావాలని చెప్పారు.
News December 3, 2025
పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.


