News November 12, 2024
వికారాబాద్లో హైటెన్షన్!

వికారాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారిపై దాడిని వ్యతిరేకిస్తూ ఓ వైపు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో పోలీసులు భారీగా మోహరించారు. దాడి వెనుక BRS హస్తం ఉందని HYD వేదికగా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ తరుణంలో గ్రామస్థుల అరెస్ట్లకు నిరసనగా BRS నేతలు వికారాబాద్ బయల్దేరారు. ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Similar News
News November 20, 2025
వజ్రోత్సవం వేళ.. JNTUపై వరాలు కురిపించేనా?

జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించేంచనున్నారు. 21న వజ్రోత్సవం, 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగనుంది. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం కళాశాలకు ఏమైనా వరాలు ప్రకటిస్తారా? అని అధ్యాపకులు, విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం రాకతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News November 20, 2025
బంజారాహిల్స్ రోడ్డు విస్తరణపై హైకోర్టు ఆదేశం

బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. భూసేకరణ చట్టం నిబంధనలను పాటించకుండా జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ విక్రమ్ దేవ్తో సహా 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News November 20, 2025
మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.


