News February 1, 2025

వికారాబాద్: అడవిలో ఉద్దేశపూర్వకంగా నిప్పు పెడితే చర్యలు

image

అటవీ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ రేంజర్ అధికారి రాజేందర్ హెచ్చరించారు.శుక్రవారం అర్ధరాత్రి యాలాల్ మండలం రాస్నం-అంపల్లి మార్గంలో గల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సెక్షన్ అధికారి కనకరాజు తన సిబ్బందితో వెళ్లి మంటలు ఆర్పారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే అటవీ భూములు సాగు చేస్తున్న రైతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Similar News

News February 24, 2026

PDPL: ఇంటర్ పరీక్షల్లో ఆ నిబంధన తొలగింపు!

image

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ‘నిమిషం ఆలస్యం’ నిబంధనను బోర్డు ఎత్తివేసిందని జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో 10,367 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు.

News February 24, 2026

విజయ్-రష్మిక పెళ్లి.. ఇవాళే మెహందీ ఫంక్షన్!

image

రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు, బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఇవాళ మెహందీ ఫంక్షన్ జరగనున్నట్లు సమాచారం. రేపు హల్దీ, సంగీత్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఎల్లుండి హిందూ సంప్రదాయ ప్రకారం వీరిద్దరి వివాహం జరగనుంది. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ వేడుకకు కేవలం 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు వార్తలొస్తున్నాయి.

News February 24, 2026

చిన్నారి మృతి కేసులో ముగ్గురి అరెస్ట్

image

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చిన్నారి <<19205888>>మృతికి<<>> కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సర్పంచ్ తుకారాంరెడ్డి సహా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.