News April 1, 2025
వికారాబాద్: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి !

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం జిల్లాలో 31 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటే ప్రజలు బయపడుతున్నారు. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి. భారీ ఎండల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News February 23, 2026
ఖమ్మం జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు!

ఖమ్మం జిల్లాలో వేసవి రాకముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 2 అడుగుల మేర నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, మధిర, కామేపల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. విచ్చలవిడి వాడకం, నీటి పొదుపు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మే నాటికి జల సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని భూగర్భజల శాఖ హెచ్చరిస్తోంది.
News February 23, 2026
తూ.గో: 58 కేంద్రాలు @ 43,108 మంది విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 58 కేంద్రాల్లో 43,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా, అరగంట ముందు వెళ్లే నిబంధనను రద్దు చేశారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాటు చేశారు.
News February 23, 2026
YELLOW ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో APలోని కోస్తా, రాయలసీమల్లో ఇవాళ వానలు కురుస్తాయని IMD తెలిపింది. TGలోని భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, మెదక్ సహా <<19211980>>17 జిల్లాలకు<<>> ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న APలోని పోలవరం, రాజవొమ్మంగి, అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. మరోవైపు కర్నూలులో దేశంలోనే అత్యధికంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డిలో వాన కురిసింది.


