News April 1, 2025

వికారాబాద్: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి !

image

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం జిల్లాలో 31 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటే ప్రజలు బయపడుతున్నారు. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి. భారీ ఎండల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News November 25, 2025

విశాఖ: ప్రియరాలి వేధింపులతో ఆత్మహత్య?

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలు వేధింపులే కారణమని యువకుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా కొద్దిరోజుల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. మిత్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 25, 2025

పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

image

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.

News November 25, 2025

GNT: ఎండు మిర్చి రేట్లకు ఊపు.. రైతుల్లో నూతన ఆశ

image

రెండేళ్ల నష్టాల తరువాత ఎండు మిర్చి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. క్వింటాలు రూ.20 వేల దాటే సూచనలు కనిపిస్తున్నాయి. శీతల గోదాముల స్టాక్ తగ్గడం, కొత్త పంట మార్కెట్లో తక్కువగా వచ్చే అవకాశమే ప్రధాన కారణం. గత ఏడాది 3.64 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఈసారి 2.67 లక్షలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో నవంబర్ మూడో వారానికి మూడు రకాల మిర్చి ధరలు ఎగబాకాయి. క్వింటాకు రూ.18,600 వరకు నమోదైంది.