News March 5, 2025
వికారాబాద్: ఎల్ఆర్ఎస్పై 25% డిస్కౌంట్: కలెక్టర్ ప్రతీక్ జైన్

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకున్నదని, ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి, క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏంపీవోలు పంచాయతీ సెక్రటరిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలను పాటిస్తూ ఎల్ఆర్ఎస్ చేయాలని అధికారులకు తెలిపారు.
Similar News
News October 17, 2025
ఉట్నూర్: దేవతకు కనుబొమ్మలు సమర్పణ

ఉట్నూర్ మండంలో దండారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం హీరాపూర్, దంతన్ పల్లి గ్రామస్థులు ఉషేగాం దండారి ఉత్సవాల్లో నిర్వహించిన కేల్క్ దాడి సాంప్రదాయ ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు, పెద్దలు వారి కనుబొమ్మలు, తల వెంట్రుకలు దేవతకి సమర్పించారు. గోండు గిరిజనులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఎత్మాసూర్ దేవతకి ఈ మొక్కులు చెల్లిస్తారని పేర్కొన్నారు.
News October 17, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు: ఎస్పీ

పోలీసు సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారం కోసం ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సిబ్బంది నుంచి వినతులను స్వీకరించిన ఆయన, వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమం ముఖ్యమని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
News October 17, 2025
అనుమతులు రాగానే అందుబాటులోకి ఇసుకరీచ్: కలెక్టర్

కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో 24,900 హెక్టార్లలో 3,73,500 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ కొరకు SEACకి నివేదికలు పంపినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. వారి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జువ్వలపాలెం ఇసుకరీచ్ అందుబాటులోకి వస్తుందని మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. ప్రతి ఇసుక రీచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి కలెక్టర్ అధికారులను ఆరా తీశారు.