News March 5, 2025
వికారాబాద్: ఎల్ఆర్ఎస్పై 25% డిస్కౌంట్: కలెక్టర్ ప్రతీక్ జైన్

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకున్నదని, ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి, క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏంపీవోలు పంచాయతీ సెక్రటరిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలను పాటిస్తూ ఎల్ఆర్ఎస్ చేయాలని అధికారులకు తెలిపారు.
Similar News
News November 18, 2025
పాఠశాల్లో కూడా ముస్తాబును నిర్వహించాలి: కలెక్టర్

విద్యార్థుల ముస్తాబు కార్యక్రమం మాదిరిగా ఇకపై పాఠశాలల ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం GJ కళాశాల సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రధానోపాధ్యాయులతో జిల్లా స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పాఠశాలలో దీన్ని ఖచ్చితంగా ఆచరించాలని, పాఠశాల ప్రాంగణంలో చెత్త లేకుండా పరిశుభ్ర వాతావరణం కనిపించాలన్నారు.
News November 18, 2025
గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.
News November 18, 2025
ఆదిలాబాద్లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.


