News February 18, 2025

వికారాబాద్: కేసులు పెండింగ్ ఉంచరాదు: ఎస్పీ

image

పాత కేసులను పెండింగ్ పెట్టరాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ , పోక్సో కేసులపై దృష్టి పెట్టాలన్నారు. 100 డైల్ వస్తే నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టాలన్నారు.  

Similar News

News December 2, 2025

టికెట్ ధరల పెంపు.. నెటిజన్ల ఆగ్రహం!

image

APలో ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల <<18450771>>పెంపునకు<<>> ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్టర్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు పెంచుకుని ఇలా ప్రేక్షకులపై భారం మోపడం కరెక్ట్ కాదని అంటున్నారు. రేట్లు పెంచితే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఐబొమ్మ రవి లాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 2, 2025

సంగారెడ్డి: రేపు కలెక్టరేట్‌లో దివ్యాంగుల దినోత్సవం

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ఈనెల 3న అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మంగళవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందిస్తామని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

News December 2, 2025

కర్నూలు రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలివే.!

image

కర్నూలు హైవే-44 సంతోశ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం <<18451272>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ మృతి చెందినవారి వివరాలను పోలీసులు తెలిపారు. మృతులు గూడూరుకి చెందిన మాలకమతల చంద్రమోహన్(32), మాల సుమన్(30)గా పోలీసులు గుర్తించారు. కాగా గాయపడిన మాల నవీన్ (33)ది ఎమ్మిగనూరు. అయితే వీరు కూలీ పనులతో జీవనం సాగించేవారని కుటుంబసభ్యులు తెలిపారు.