News February 18, 2025

వికారాబాద్: కేసులు పెండింగ్ ఉంచరాదు: ఎస్పీ

image

పాత కేసులను పెండింగ్ పెట్టరాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ , పోక్సో కేసులపై దృష్టి పెట్టాలన్నారు. 100 డైల్ వస్తే నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టాలన్నారు.  

Similar News

News October 28, 2025

ఇక ‘సింగూరు’ చిక్కులు లేకుండా ప్రభుత్వం చర్యలు

image

మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు రిజర్వాయరుకు మరమ్మతులు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం సర్కారు రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు కానున్నాయి. ఈలోపు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు ఏళ్ల పాటు సింగూరుకు పనులు జరగుతాయి. ప్రస్తుతం సింగూరు నుంచి సిటీకి 7 TMCల నీరు ఉపయోగిస్తున్నారు.

News October 28, 2025

NRPT: యువజనోత్సవాలు పురస్కరించుకొని పోటీలు

image

యువజనోత్సవాలు పురస్కరించుకొని నవంబర్ 5న నారాయణపేట ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జానపద నృత్యాలు, గేయాలు, కవిత రచన, పెయింటింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు.

News October 28, 2025

ఉండవెల్లి మండలంలో 38.9 మిల్లీమీటర్ల వర్షం

image

గద్వాల జిల్లాలో ముసురు పడింది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉండవెల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 38.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ధరూర్‌లో 0.2, గద్వాల 1.3, మల్దకల్ 0.4, గట్టు 1.0, అయిజ 0.3, రాజోలి 2.8, వడ్డేపల్లి 1.3, మానవపాడు 13.8, అలంపూర్ 12.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో వర్షం కురవలేదు.