News February 15, 2025
వికారాబాద్: చికెన్ తినాలంటే భయమేస్తోంది: ప్రజలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు మండలాలలో, గ్రామాలలో చికెన్ తినాలంటే ప్రజలు భయమేస్తోందని తెలిపారు. బర్డ్ బ్లూ సోకడం ద్వారా ఎలాంటి వ్యాధులు సోకుతాయని భయాందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. సండే అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. దీంతో ఎలాంటి వ్యాధి వస్తుందోనని చికెన్ ప్రియులు భయపడుతున్నారు.
Similar News
News November 10, 2025
CSK నుంచి జడేజా ఔట్?

రాజస్థాన్తో ట్రేడ్ డీల్లో భాగంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. RR నుంచి సంజూను తీసుకునేందుకు చెన్నై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జడేజా ఇన్స్టా అకౌంట్ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ డీల్ తర్వాత ఫ్యాన్స్ వార్ను నివారించడానికి అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకున్నారా? లేక టెక్నికల్ సమస్యనా అనేది తెలియరాలేదు.
News November 10, 2025
ప్రచారం కోసం పిటిషన్లా? కేఏ పాల్పై సుప్రీం ఆగ్రహం

ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పిల్స్ దాఖలు చేస్తున్నారని మండిపడింది. PPP అంశంపై ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
News November 10, 2025
కిర్లంపూడి: నలుగురికి చేరిన మృతుల సంఖ్య

కిర్లంపూడి మండలం ఎన్.హెచ్. 16 జాతీయ రహదారిపై ఈ నెల 8న ఓ పెళ్లి కారు ఢీకొనడంతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న జగ్గంపేట మండలం ఇర్రిపాకకు చెందిన యువతి కూండ్రపు దుర్గా చైతన్య సోమవారం ఉదయం కన్నుమూసింది. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరింది.


