News February 15, 2025
వికారాబాద్: చికెన్ తినాలంటే భయమేస్తోంది: ప్రజలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు మండలాలలో, గ్రామాలలో చికెన్ తినాలంటే ప్రజలు భయమేస్తోందని తెలిపారు. బర్డ్ బ్లూ సోకడం ద్వారా ఎలాంటి వ్యాధులు సోకుతాయని భయాందోళన చెందుతున్నారు. దీని గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. సండే అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. దీంతో ఎలాంటి వ్యాధి వస్తుందోనని చికెన్ ప్రియులు భయపడుతున్నారు.
Similar News
News November 25, 2025
కృష్ణా: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాల పోస్టుల భర్తీకి సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో మొత్తం 17 అంగన్వాడీ కార్యకర్త, 82 సహాయకురాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ICDS PD రాణి తెలిపారు. అర్హులైన వారు డిసెంబర్ 3వ తేదీలోపు సంబంధిత CDPO ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21-35సం.ల మధ్య వయసు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు.
News November 25, 2025
నేడు హనుమకొండలో బీజేపీ రైతు దీక్ష

రైతుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఏకశిల పార్క్లో మహా రైతు దీక్ష చేపట్టానున్నారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు.
News November 25, 2025
జగన్నాథపురంలో శాటిలైట్ రైల్వే స్టేషన్?

విశాఖ రైల్వే స్టేషన్ మీద ట్రాఫిక్ భారం తగ్గించేందుకు రైల్వే శాఖ సబ్బవరం సమీపంలోని జగన్నాథపురం వద్ద కొత్త శాటిలైట్ స్టేషన్ను ప్రతిపాదించినట్లు సమాచారం. కొత్తవలస–అనకాపల్లి మధ్య 35 కిమీ బైపాస్ లైన్ ప్రాజెక్టులో భాగంగా.. 563 హెక్టార్లు విస్తీర్ణంలో రూ.2,886.74 కోట్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేషన్లో 15 ఫ్రైట్ ఎగ్జామినేషన్ లైన్లు, 5 కోచింగ్, 11 స్టాబ్లింగ్ లైన్లు ఉండనున్నట్లు సమాచారం.


