News February 11, 2025
వికారాబాద్ జడ్పీ పీఠంపై కీలక నేతల దృష్టి

వికారాబాద్ జడ్పీ పీఠంపై కీలక నేతలు దృష్టి సారించారు. మహిళా రిజర్వేషన్ వస్తే బుయ్యని సరళారెడ్డి, జనరల్ వస్తే బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కొండల్రెడ్డి, BC వస్తే రవిగౌడ్, ఉత్తమ్చంద్, లాల్ కృష్ణ, ST వస్తే ధారసింగ్, కిషన్నాయక్, SCకి అయితే ఓ కీలకనేత కూతురు భరిలో ఉండనున్నారు. CM సొంత జిల్లా కావడంతో జడ్పీ ఛైర్మన్ పదవీ ఎంపిక కీలకం కానుంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News September 16, 2025
DSC: జిల్లాలో మిగిలిపోయిన 56 పోస్టులు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 807 పోస్టులకు డీఎస్సీ-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 775 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవగా, 755 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉద్యోగ అర్హత పత్రాలు అందించనున్నారు. కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు లేక జిల్లాలో 56 పోస్టులు మిగిలాయి.
News September 16, 2025
పార్వతీపురం: నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్హత పొందిన వారికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు ఆర్థిక సాయం అందజేయనుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఏపీలో రిజిస్టర్ కాబడిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ డ్రైవర్లు అర్హులన్నారు.
News September 16, 2025
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.