News February 6, 2025
వికారాబాద్ జిల్లాలోని సఖీ కేంద్రంలో పోస్టులు

వికారాబాద్ జిల్లాలోని సఖీ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కంప్యూటర్ అపరేటర్, సెక్యూరిటీగార్డ్(షిప్ట్ వైస్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలకు 9652807354కు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను ఆన్ లైన్లో కూడా స్వీకరించనున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2025
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరు కాలేదు. గతంలో కాళేశ్వరం పుష్కరాలు, ఈఎస్ఐ ఆసుపత్రి కార్యక్రమాల్లోనూ ఎంపీని పక్కనపెట్టిన ఘటనలు ఉన్న నేపథ్యంలో, తాజా పరిణామం ఎమ్మెల్యేలు-ఎంపీ మధ్య సమన్వయ లోపాన్ని మరింత స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనకపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
News November 24, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందలలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతే గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్పై ఈ రైడ్స్ జరిగాయి.


