News March 17, 2025

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి సర్వే!

image

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి కుష్టు వ్యాధికి సంబంధించి సర్వే చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 720 మంది ఆశావర్కర్లతో ఈనెల 31వ తేదీ వరకు సర్వే చేయనున్నట్లు జిల్లా లెప్రసీ నిర్మూలన అధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ప్రతి ఆశాకార్యకర్త రోజుకు 25 ఇళ్లను సందర్శించి సర్వే చేయనున్నారు. కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.SHARE IT

Similar News

News December 8, 2025

ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

image

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్‌ఖాన్‌పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్‌లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్‌ను సందర్శించారు.

News December 8, 2025

మన్యం బిడ్డను సత్కరించిన కలెక్టర్

image

అండర్-19 క్రికెట్ టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాంగి కరుణకుమారిని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. కరుణకుమారికి శాలువా కప్పి అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు. పాడేరు(M)లోని మారుమూల గ్రామమైన వంట్లమామిడిలో ఆదివాసీ కుటుంబంలో పుట్టిన కరుణకుమారి అంతర్జాతీయ క్రికెట్‌‌లో రాణించడం గొప్ప విషయమని కలెక్టర్ కొనియాడారు.

News December 8, 2025

తిరుచానూరు: అర్చకుల ముసుగులో ఒక్కరు కాదు ఇద్దరు

image

ఆలయంలో అర్చకులు అంటే భక్తులకు చాలా గౌరవం. కానీ టీటీడీ పరిధిలోని తిరుచానూరు ఆలయంలో పనిచేసే అర్చకుల ముసుగులో ఇద్దరు అనధికారికంగా ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. ఎప్పటి నుంచి ఉన్నారు..? ఎవరి ద్వారా ఆలయంలో ఉన్నారు..? ఇంత జరుగుతున్నా ఎందుకు అధికారులు గుర్తించలేదనే వివరాలు నమోదు చేశారని తెలుస్తోంది. నేడో.. రేపో నివేదిక ఉన్నతాధికారులకు అందించనున్నారని సమాచారం.