News February 7, 2025
వికారాబాద్ జిల్లాలో 70,219 మందికి రైతు భరోసా

రెండో రోజుల్లో వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 70,219 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 70,219 మంది రైతుల ఖాతాలో రూ.32,99,94,264 కోట్లు జమయ్యాయని తెలిపారు. మిగతా రైతులకు సైతం త్వరలో డబ్బులు జమవుతాయన్నారు.
Similar News
News March 21, 2025
IOC కొత్త ప్రెసిడెంట్గా కిర్స్టీ కోవెంట్రీ

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా జింబాబ్వే స్విమ్మర్, పొలిటీషియన్ కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. గ్రీస్లో జరిగిన 144వ IOC సెషన్లో కమిటీ మెంబర్స్ ఆమెను ఎన్నుకున్నారు. ఈ సెషన్లో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు. లాస్ ఏంజెలిస్-2028 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 21, 2025
మెదక్: 10TH విద్యార్థులకు ALL THE BEST

టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు ఉమ్మడి మెదక్ కలెక్టర్లు మను చౌదరి, వల్లూరు క్రాంతి, రాహుల్ రాజ్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్ఫోను అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్, అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
News March 21, 2025
నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంకు చెందిన ఎన్.రాము (54) రాజయ్యపేట శివారు కల్లుపాకల వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 19న పొలానికి వెళ్లిన రాము ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గురువారం కల్లుపాకల వద్ద శవమై కనిపించాడు. ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నందున కుటుంబ సభ్యులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.